హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

న్యూఢిల్లీ యాత్రకు ముఖ్యమంత్రి రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కె. రోశయ్య బుధవారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తిరిగి శుక్రవారం హైదరాబాద్ తిరిగి వస్తారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన బుధవారం రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులతో సమావేశమవుతారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై ఆయన పార్లమెంటు సభ్యులతో చర్చిస్తారు. ఢిల్లీలోని ఆంధ్రా క్యాడర్ అధికారులతో ఆయన మూడో రోజు సమావేశమవుతారని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు చెప్పారు.

రోశయ్య కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి చెందిన నాయకులతో పాటు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమవుతారు. డిసెంబర్ 7వ తేదీ నుంచి జరిగే శానససభా సమావేశాలు, సభా పక్ష నేత ఎంపిక, మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక వంటి అంశాలపై ఆయన సోనియాతో మాట్లాడే అవకాశాలున్నాయి. వీటికి తోడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో తలెత్తిన పరిణామాలపై కూడా ఆయన చర్చించే అవకాశాలున్నాయి. కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో రాజ్యసభ సభ్యులు కెవిపి రామచందర్ రావు, వి. హనుమంతరావుల మధ్య జరిగిన గొడవను కూడా ఆయన పార్టీ అధిష్టానం దృష్టికి తెచ్చే అవకాశాలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X