హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ నిమ్స్ కు కె చంద్రశేఖర రావు తరలింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావును హైదరాబాద్ లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)కు తరలించారు. ఖమ్మంలోని ప్రభుత్వాస్పత్రి నుంచి ఆయనను గురువారం ఉదయం నిమ్స్ కు తరలించారు. ఆయనను నిమ్స్ లోని ఎఎంసీలో చేర్చారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కెసిఆర్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను నిమ్స్ కు తరలించారు. ఎనిమిది మందితో కూడిన ప్రత్యేక వైద్య బృందం ఆయనకు పరీక్షలు నిర్వహిస్తోంది.

నిమ్స్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు నిమ్స్ కు చేరుకున్నారు. నిమ్స్ కు వద్దకు పెద్ద యెత్తున తెలంగాణవాదులు తరలి వచ్చారు. కెసిఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే చాలా బలహీనంగా ఉన్నారని చెబుతున్నారు. కెసిఆర్ కాన్వాయ్ వెంట కెసిఆర్ తనయుడు కెటి రామారావు, కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X