వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

48 గంటల బంద్: హైదరాబాద్ లో విధ్వంసం

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Bandh
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రేపటి నుంచి 48 గంటల బంద్ పిలువునిచ్చింది. శనివారం ఇక్కడ అత్యవసరంగా సమావేశమై రేపటి నుంచి 48 గంటల పాటు బంద్ పాటించాలని నిర్ణయించింది. ప్రభుత్వం విద్యార్థులపై, తమ కార్యకర్తలపై, నేతలపై కేసులు పెడితే సహించబోమని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం దిగి రానందుకు నిరసనగా తెరాస ఈ బంద్ కు పిలుపునిచ్చింది.

కాగా, విద్యార్థులు హైదరాబాదులోని పంజగుట్ట ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు గుంపులు గుంపులుగా బయలుదేరి దుకాణాలపై దాడి చేశారు. హైదరాబాద్ సెంట్రల్, బిగ్ బజార్ పై విద్యార్థులు దాడి చేసారు. హైదరాబాద్ సెంట్రల్ అద్దాలు పగిలిపోయాయి. విద్యార్థులు అమీర్ పేట, పంజగుట్ట, గ్రీన్ పార్కు ప్రాంతాల్లో విద్యార్థులు దాడులకు తెగబడుతున్నారు. విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. బస్సులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మైత్రివనం వద్ద రెండు బస్సులకు నిప్పు పెట్టారు. బస్సులపై దాడులు చేస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. నాగార్జున సర్కిల్ లో కూడా విద్యార్థులు దాడులకు దిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X