వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
48 గంటల బంద్: హైదరాబాద్ లో విధ్వంసం
కాగా, విద్యార్థులు హైదరాబాదులోని పంజగుట్ట ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు గుంపులు గుంపులుగా బయలుదేరి దుకాణాలపై దాడి చేశారు. హైదరాబాద్ సెంట్రల్, బిగ్ బజార్ పై విద్యార్థులు దాడి చేసారు. హైదరాబాద్ సెంట్రల్ అద్దాలు పగిలిపోయాయి. విద్యార్థులు అమీర్ పేట, పంజగుట్ట, గ్రీన్ పార్కు ప్రాంతాల్లో విద్యార్థులు దాడులకు తెగబడుతున్నారు. విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. బస్సులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మైత్రివనం వద్ద రెండు బస్సులకు నిప్పు పెట్టారు. బస్సులపై దాడులు చేస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. నాగార్జున సర్కిల్ లో కూడా విద్యార్థులు దాడులకు దిగారు.
Comments
Story first published: Saturday, December 5, 2009, 15:27 [IST]