వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ సోమవారానికి వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: సభ్యుల రాజీనామాలు దండిగా ఉండడంతో సభా కార్యక్రమాలను నిర్వహించలేని స్థితిలో శాసనసభను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి సోమవారానికి వాయిదా వేశారు. సభ సమావేశనప్పటి నుంచి ప్రాంతీయ విభేదాలతో సభ అట్టుడుకుతూనే ఉన్నది. శుక్రవారం ఉదయం సభ సమావేశం కాగానే రాజీనామాలు చేసిన కొంత మంతి సభ్యులు సభలోకి వచ్చి సమైక్యాంధ్ర నినాదాలు చేసి బయటకు వెళ్లిపోయారు. అంతకు ముందు సభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. సమైక్యాంధ్రవాదుల నిరనసలన మధ్య సభ తొలుత వాయిదా పడింది. ఏకపక్షంగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవడాన్ని కోస్తా, రాయలసీమ శాసనసభ్యులు నిరసిస్తూ సభలో ఆందోళనకు దిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు.

శాసనసభ్యుల రాజీనామాలపై శుక్రవారం అంతకు ముందు శాసనసభలో చర్చ జరిగింది. సభలో కేవలం 83 మంది సభ్యులు మాత్రమే ఉండడంతో సభను నిర్వహించాలా వద్దా అనే విషయంపై స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీల సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మెజారిటీ సభ్యులు లేనందున సభను ఎలా నడుపుతారని మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ తాను రాజీనామాలను ఆమోదించే వరకు వారు కూడా సభ్యులేనని స్పీకర్ అన్నారు. దీనిపై రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోవాలని అక్బరుద్దీన్ కోరారు.

సభలో తెలంగాణ తీర్మానం చేయాలనే నిర్ణయం సరైందేనని, అయితే అందుకు అనుసరించిన విధానమే బాగా లేదని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. రాజీనామాలను వెనక్కి తీసుకుని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సిపిఐ సభ్యుడు మల్లేష్ కోరారు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను ఆహ్వానించి సభ్యులు రాజీనామాలు ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ స్పీకర్ ను కోరారు. అయితే ఎట్టకేలకు సభ్యుల సంఖ్య సరిగా లేకపోవడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X