వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు తెలంగాణ ఎంపీల తలోమాట

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
హైదరాబాద్: హైదరాబాదులో శాంతిర్యాలీలు చేపడతామనే కొంత మంది ప్రకటనపై కాంగ్రెసు తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎవరి కోసం శాంతి ర్యాలీలు నిర్వహిస్తారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ ప్రశ్నించారు. శాంతిర్యాలీలు నిర్వహించడానికి ఇక్కడేమైనా మత కల్లోలాలు జరిగాయా అని ఆయన అడిగారు. శాంతిర్యాలీలు నిర్వహిస్తే వాటిని ప్రజలే అడ్డుకుంటారని ఆయన గురువారం హెచ్చరించారు. శాంతి ర్యాలీల ముసుగులో కొంత మంది సమైక్యాంధ్ర ర్యాలీలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారని పార్లమెంటు సభ్యుడు వినోద్ విమర్శించారు. చిన్న రాష్టాల వల్లనే మేలు జరుగుతుందని నిర్ధారణ అయిందని ఆయన అన్నారు. హైదరాబాదులో శాంతి ర్యాలీలు నిర్వహిస్తామని హైదరాబాదు మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ ఇంతకు ముందు ప్రకటించగా, తాజాగా సినీ నటుడు మోహన్ బాబు ప్రకటించారు.

రాజీనామాలు చేయాలనే ఒత్తిడిపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ తీవ్రంగా ప్రతిస్పందించారు. బ్లాక్ మెయిల్, బెదిరింపుల వల్ల తెలంగాణ రాదని ఆయన అన్నారు. రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలనుకునేవారు తమకు శత్రువులు, దేశద్రోహులు అని ఆయన అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగానే ఉందని, రాజకీయ జెఎసి అవసరం లేదని ఆయన అన్నారు. రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలనుకునేవారి వల్ల నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. రాజీనామాలు చేయడాన్ని తమ పార్టీకి చెందినవారు ఆహ్వానించబోరని ఆయన అన్నారు. తమకు తెలంగాణ విషయంలో అనుమానాలు లేవని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X