వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెల్బోర్న్ లో గురుద్వారాకు నిప్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

Melbourne
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గురుద్వారా ఆస్ట్రేలియాలో దాడికి గురైంది. మెల్బోర్న్ లోని గురుద్వారా ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవనానికి దుండగులు నిప్పు పెట్టారు. ఈ విషయాన్ని భారత్ ఆస్ట్రేలియా దృష్టికి తీసికెళ్లింది. మెల్బోర్న్ శివారులోని క్రాన్ బౌర్న్ లో నానాక్షర్ తాథ్ గురుద్వారా ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవనానికి దుండగులు నిప్పు పెట్టినట్లు భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి చెప్పారు. ఈ సంఘటన ఈ నెల 12వ తేదీన జరిగింది.

సంఘటనకు సంబంధించిన వివరాలను గురుద్వార మేనేజ్ మెంట్ కమిటీ నుంచి తీసుకుని ఆస్ట్రేలియా ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లడానికి తమ కాన్సులేట్ ప్రయత్నిస్తున్నట్లు ఆ ప్రతినిధి చెప్పారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. నిర్మాణానికి మాత్రం నష్టం జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X