మెల్బోర్న్ లో గురుద్వారాకు నిప్పు

Melbourne
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గురుద్వారా ఆస్ట్రేలియాలో దాడికి గురైంది. మెల్బోర్న్ లోని గురుద్వారా ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవనానికి దుండగులు నిప్పు పెట్టారు. ఈ విషయాన్ని భారత్ ఆస్ట్రేలియా దృష్టికి తీసికెళ్లింది. మెల్బోర్న్ శివారులోని క్రాన్ బౌర్న్ లో నానాక్షర్ తాథ్ గురుద్వారా ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవనానికి దుండగులు నిప్పు పెట్టినట్లు భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి చెప్పారు. ఈ సంఘటన ఈ నెల 12వ తేదీన జరిగింది.

సంఘటనకు సంబంధించిన వివరాలను గురుద్వార మేనేజ్ మెంట్ కమిటీ నుంచి తీసుకుని ఆస్ట్రేలియా ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లడానికి తమ కాన్సులేట్ ప్రయత్నిస్తున్నట్లు ఆ ప్రతినిధి చెప్పారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. నిర్మాణానికి మాత్రం నష్టం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+