వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విఘాతం కలిగించవద్దు: మనీష్ తివారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Manish Tiwari
న్యూఢిల్లీ: తెలంగాణ అంశం పరిష్కారానికి సంప్రదింపుల ప్రక్రియ ప్రధానమని, ఈ ప్రక్రియకు విఘాతం కలిగించేలా ఏ రాజకీయ పార్టీ కూడా వ్యవహరించడం మంచిది కాదని ఎఐసిసి అధికారిక ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 28వ తేదీలోగా తెలంగాణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ జెఎసి చేసిన డిమాండ్ పై ఆయన ఆచితూచి మాట్లాడారు.

కేంద్ర హోం మంత్రి చిదంబరం ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన రాజకీయ పార్టీలతో సంప్రదింపుల ప్రక్రియను విజయవంతంగా చేపట్టారని, రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని అన్ని పార్టీలూ కోరాయని, ఇప్పుడు చర్చల ప్రక్రియ మన ముందుందని, ఈ స్థితిలో ఏ రాజకీయ పార్టీ కూడా అగ్నికి ఆజ్యం పోసేలా వ్యవహరించకూడదని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని చర్చలు, సంప్రదింపుల ద్వారానే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X