వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంగాసాగర్ వద్ద తొక్కిసలాట: 7గురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Ganga Sagar
కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్ లోని గంగాసాగర్ వద్ద గురువారం ఉదయం సంభవించిన తొక్కిసలాటలో ఏడుగురు యాత్రికులు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు. మకర సంక్రాంతి సందర్భంగా గంగానదిలో పవిత్ర స్నానాలు చేయడానికి పెద్ద యెత్తున భక్తులు తరలివచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటన గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో గంగాసాగర్ దీవికి వెళ్లడానికి పడవలు ఎక్కడానికి ఒకేసారి యాత్రికులు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మృతుల్లో ఆరుగురు మహిళలు కాగా, ఒకరు చిన్నారి. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని అనుమానిస్తున్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గంగాసాగర్ పశ్చిమ బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలో ఉంది. ఇక్కడ పవిత్ర గంగానది సముద్రంలో కలుస్తుంది. ఇది కోల్ కత్తాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X