వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

28లోగా తెలంగాణ రాజీనామాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

JAC
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంతానికి చెందిన శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులందరి చేత రాజీనామా చేయించాలని తెలంగాణ స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. రాజీనామాలకు అందరినీ ఒప్పించడానికి జెఎసి స్టీరింగ్ కమిటీ ఒక కార్యాచరణను రూపొందించింది. కోదండరామ్ అధ్యక్షతన బుధవారం జరిగిన తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశంలో అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి చేపట్టనున్న నిరాహారదీక్షలు, నిరసనలు ఎలా ఉండాలనే అంశంపై కూడా సమావేశంలో చర్చించారు. రోజుకు ఐదుగురు తగ్గకుండా ప్రజాప్రతినిధులు నిరాహార దీక్షలో పాల్గొనాలని నిర్ణయించారు. ఈ దీక్షల్లో ఒక రోజు ఒకే పార్టీకి చెందినవారు కూర్చోవాలా, అన్ని పార్టీలకు చెందినవారు కూర్చోవాలా అనే అంశంపై తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అదుర్స్ సినిమా వివాదం చాలా చిన్నదని, దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతుందని డిజిపి గిరీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను సమావేశం ఖండించినట్లు జెఎసి కన్వీనర్ కోదండరామ్ చెప్పారు. డిజిపి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయని ఆయన అన్నారు. డిజిపిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమావేశంలో ఓ తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందినవారికి హైదరాబాదులో పూర్తి రక్షణ కల్పిస్తామని ఆయన చెప్పారు. రాజీనామాలకు మజ్లీస్ ను కూడా ఒప్పిస్తామని కాంగ్రెసు శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X