వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమాటోగ్రాఫర్ వికె మూర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

|
Google Oneindia TeluguNews

VK Murthy
ముంబై: సినిమాటోగ్రాఫర్‌ వీకే మూర్తికి 2008 సంవత్సరపు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు లభించింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ పురస్కారం సినిమాటోగ్రాఫర్‌కి దక్కడం ఇదే మొదటిసారి. మూర్తి గురుదత్‌ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. పాకీజా, కాగజ్‌కే ఫూల్‌, సీఐడీ తదితర చిత్రాలకు కెమెరామన్‌గా పనిచేశారాయన.

వికె మూర్తి 1932లో మైసూరులో జన్మించారు. బెంగళూరు ఎస్ జె పాలిటెక్నిక్ నుంచి సినిమాటోగ్రఫీలో డిప్లొమా పొందారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని 1943లో జైలు కెళ్ళారు. ఐదు దశాబ్దాల పాటు ముంబయ్ లో నివసించిన అనంతరం ఆయన ప్రస్తుతం బెంగళూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. 2005లో ఐఐఎఫ్ ఎ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును అమ్ స్టర్ డమ్ లో అందుకున్నారు. రాష్ట్రపతి స్వయంగా అందజేసే ఈ అవార్డుతో 10లక్షల నగదు, స్వర్ణ కమలం అందజేస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X