వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై కేంద్రానికి డెడ్ లై పెట్టలేదు: కోదండరామ్

By Santaram
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై కేంద్రానికి తాము ఎటువంటి డెడ్‌ లైన్‌ పెట్టలేదని జేఏసీ కన్వీనర్‌ కోదండరామ్‌ అన్నారు. తాము ఎమ్మెల్యేల రాజీనామాలపై మాత్రమే డెడ్‌లైను విధించామన్నారు. గురువారం ఆయన రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై స్పష్టమైన కాలపరిమితితో కూడిన ప్రకటనను కేంద్రం నుంచి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

తెలంగాణ అంశంపై కేంద్రం వెనకడుగు, ముందడుగు వేయటం లేదని, దీన్నే కోల్ట్‌ స్టోరేజ్‌లో పెట్టడం అంటారని కోదండరామ్‌ అన్నారు. కేంద్రం రోజుకో ప్రకటన చేయటం వల్లే ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలకు వెనకడుగు వేయటం అంటే పాలల్లో విషం చుక్కలు వేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇలా ఉండగా ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఢిల్లీ చర్చలకు వెళ్లిన నాయకుల్ని నమ్ముకుంటే తెలంగాణ నాలుగోసారి మోసపోతుందని ఆయన గురువారం ఇక్కడ అన్నారు. చర్చల ద్వారా తెలంగాణ రాదని ఉద్యమాల ద్వారానే సాధ్యమని మందకృష్ణ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X