వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతి శనివారం జిల్లాల్లో పర్యటిస్తా: రోశయ్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: ఇకమీదట ప్రతి శనివారం జిల్లాల్లో పర్యటిస్తానని ముఖ్యమంత్రి రోశయ్య గురువారం కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో విశ్వాసం తగ్గిందని ఆయన అన్నారు. రెండోరోజు కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల అమలులో వేగం, నాణ్యత పెరగాలన్నారు. ప్రభుత్వంపై విశ్వసనీయత పెంచవల్సిన సమయం ఇదేనని, ప్రజలకు ఆ మార్పు స్పష్టంగా కనపడేలా పనిచేయాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. అభివృద్ధి అంటే భూములను పంచటం కాదని, ఆ ఫలాలు ప్రజలకు చేరాలన్నారు. పేదల జీవితంలో మార్పు రావాలన్నారు.

నకిలీల కారణంగా రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైందన్న భావన ప్రజల్లోకి వెళ్లిందన్నారు. రెవెన్యూ వసూళ్లపై దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితేనే సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతామన్నారు. త్వరలో జాయింట్‌ కలెక్టర్లతో రెండు రోజుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కలెక్టర్లు నేరుగా తనతో మాట్లాడాలని సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X