వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉద్యోగుల ఫిట్మెంట్ పై కుదిరిన ఒప్పందం
39 శాతం మానిటరీ బెనిఫిట్ ను కూడా 2010 నుంచి ఇస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే వారు 2009 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏ మాత్రం దిగి రాలేదు. దీంతో ప్రభుత్వ నిర్ణయానికే ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. ఉద్యోగుల మరిన్ని ప్రయోజనాలు శాసనసభ సమావేశాల తర్వాత పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఖాజానా ఖాళీగా ఉండడంతో ప్రభుత్వోద్యోగుల పూర్తి డిమాండ్లను నెరవేర్చలేకపోతున్నామని, దీన్ని అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు తాము వెనక్కి తగ్గామని ఉద్యోగ సంఘాల జెఎసి నాయకులు చెప్పారు. పెరిగిన ఫిట్మెంటులో సీనియర్ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరిగిందని మోహన్ రెడ్డి అన్నారు.
Story first published: Wednesday, January 27, 2010, 15:01 [IST]