సోనియాకు కెవిపిపై తెలంగాణ ఫిర్యాదు

KVP Ramchandar Rao
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సన్నిహిత మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుపై కాంగ్రెసు తెలంగాణ నేతలు దామోదర్ రెడ్డి, కె. జానా రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కెవిపై గురించి వారు వివరాలన్నీ అందించిన తర్వాతనే తెలంగాణపై కమిటీ వేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది. తెలంగాణ జెఎసి పెట్టిన గడువు పట్టించుకోకూడదని, ఒత్తిడికి తలొగ్గ కూడదని కాంగ్రెసు అధిష్టానం తొలుత భావించింది. అయితే, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు పట్టుదలతో వ్యవహరించి దామోదర్ రెడ్డికి, జానా రెడ్డికి సోనియా అపాయింట్ మెంటు ఇప్పించినట్లు సమాచారం. దాంతో వారిద్దరు కెవిపి వల్లనే సమైక్యాంధ్ర ఉద్యమం చెలరేగుతోందని, పెట్టుబడిదారులే ఆ ఉద్యమం వెనక ఉన్నారని వారు సోనియాకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణపై చిదంబరం ప్రకటన వెలువడిన తర్వాత పదవ తేదీన సీమాంధ్ర శాసనసభ్యుల రాజీనామాల వెనక కెవిపి హస్తం ఉందని వారు చెప్పినట్లు తెలుస్తోంది. రాజీనామా లేఖలన్నీ ఒకే రీతిన ఉన్నాయని, వాటిని కెవిపి రామచందర్ రావు తయారు చేయించి శాసనసభ్యులకు అందించారని వారు చెప్పినట్లు తెలుస్తోంది.

రెండు ప్రాంతాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని, తమకు రెండు ప్రాంతాలు కూడా ముఖ్యమేనని సోనియా దామోదర్ రెడ్డి, జానా రెడ్డిలతో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, సీమాంధ్ర సమైక్యవాదం వెనక కెవిపి పాత్ర ఎలా ఉందో వారు వివరించిన తర్వాత ఆమె మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. కేశవ రావుతో కలిసి సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కు తెలంగాణలోని పరిస్థితిని, సీమాంధ్ర ఉద్యమ తీరుతెన్నులను వారిద్దరు వివరించినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర శాసనసభ్యుల రాజీనామాల వెనక కెవిపి రామచంద్రరావు ఉన్నారని వారు అహ్మద్ పటేల్ కు చెప్పారు. అలాగే, తెలంగాణ ఉద్యమం వెనక నక్సలైట్లు ఉన్నారనే ప్రచారంలో కూడా నిజం లేదని వారు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల రాజీనామాల విషయాన్ని రాయలసీమకు చెందినవాడు కాబట్టి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి చెప్పలేదని వారు ఫిర్యాదు చేశారు. వాస్తవాలు అధిష్టానానికి తెలియకుండా సీమాంధ్ర నాయకులు పథకం ప్రకారం పని చేస్తున్నారని వారు వివరించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఇస్తే మిమ్మల్ని ఆ ప్రాంత ప్రజలు పూజిస్తారని వారు సోనియాకు చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసు నాయకులు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి కూడా ఉండదని చెబుతూ ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలను వారు ఉదహరించినట్లు తెలుస్తోంది. ఇదంతా విన్న సోనియా చిదంబరంతో ప్రకటన చేయించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+