చిదంబరంపై విమర్శలెందుకు: కోదండరామ్

సీమాంధ్ర నేతలు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాదులోని సమైక్య సదస్సు నిర్వహిస్తామని సీమాంధ్ర నాయకులు చెప్పడం సరి కాదని ఆయన అన్నారు. 7వ తేదీన నిజాం కళాశాల మైదానంలో తెలంగాణ ముస్లింల సభ ఉందని, వరంగల్ లో విద్యార్థుల పొలికేక సభ ఉందని, ఇటువంటి సభలు జరుగుతున్న పరిస్థితిలో సమైక్యాంధ్ర సదస్సు నిర్వహించడం రెచ్చగొట్టడమే అవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి ఆధ్వర్వంలో రేపు బుధవారం శాంతియుత మానవ హారం నిర్వహించునున్నట్లు ఆయన తెలిపారు. ఆదిలాబాదు నుంచి ఆలంపూర్ వరకు ఈ మానవ హారం ఉంటుందని ఆయన చెప్పారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు మానవ హారం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఆకాంక్షను సంఘటితంగా వ్యక్తం చేయడానికే ఈ మానవ హారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ధర్నాలు, రాస్తారోకోలు ఉండవని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications