ముదురుతున్న విభేదాలతో బాబుకు బొప్పి

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీని వ్యతిరేకించే విషయంలో సీమాంధ్ర పార్టీ నాయకులు హద్దులు దాటుతున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. కె. ఎర్రంనాయుడు, ఎంవి మైసురా రెడ్డి కమిటీని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో లాబీయింగ్ చేస్తుండడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారిద్దరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని తెలంగాణ నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ వారు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర హోం మంత్రి చిదంబరంపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ ఎర్రంనాయుడు, మైసురా రెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారని, ఇది సరైన చర్య కాదని తెలంగాణ నాయకులు భావిస్తున్నారు. అలాగే రాయలసీమకు చెందిన శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ పై కూడా తెలంగాణ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. కేశవ్ కూడా హద్దులు దాటుతున్నారని వారంటున్నారు.












Click it and Unblock the Notifications