వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెవిపి అవినీతిపై ప్రధానికి పాల్వాయి ఫిర్యాదు
జలయజ్ఝం ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఈ విషయం భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు కూడా తెలుసునని ఆయన అన్నారు. జలయజ్ఝంలోని అవినీతి వల్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని ఆయన అన్నారు. దాని వల్ల రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ దెబ్బ తిన్నదని ఆయన అన్నారు. దానివల్లనే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష జరుపుతోందని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టుల్లో 30 నుంచి 40 శాతం వరకు అవినీతి చోటు చేసుకుందని ఆయన అన్నారు. దీనిపై తమ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని, లేకపోతే రోశయ్య ప్రభుత్వం సరిగా నడవడం కష్టమని ఆయన అన్నారు.
Story first published: Friday, February 5, 2010, 14:31 [IST]