కెవిపి అవినీతిపై ప్రధానికి పాల్వాయి ఫిర్యాదు

KVP Ramchandar Rao
హైదరాబాద్: తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై తాను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి చెప్పారు. కెవిపి అక్రమాలకు పాల్పడినట్లు తెలుగుదేశం శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలు అసత్యమని తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుందని, లేకుంటే కాంగ్రెసు వారంతా అవినీతిపరులనే అభిప్రాయం ప్రజలకు కలుగుతుందని, దాని వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెవిపి అవినీతిపరుడని తాను అనలేదని, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణ గురించి మాత్రమే ప్రస్తావించానని ఆయన అన్నారు.

జలయజ్ఝం ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఈ విషయం భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు కూడా తెలుసునని ఆయన అన్నారు. జలయజ్ఝంలోని అవినీతి వల్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని ఆయన అన్నారు. దాని వల్ల రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ దెబ్బ తిన్నదని ఆయన అన్నారు. దానివల్లనే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష జరుపుతోందని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టుల్లో 30 నుంచి 40 శాతం వరకు అవినీతి చోటు చేసుకుందని ఆయన అన్నారు. దీనిపై తమ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని, లేకపోతే రోశయ్య ప్రభుత్వం సరిగా నడవడం కష్టమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+