వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్ర విద్యార్థుల అరెస్టుపై నిరసన

By Pratap
|
Google Oneindia TeluguNews

Students
విజయవాడ: రాష్ట్రం కలిసి ఉండాలని కోరుతూ హైదరాబాద్ కు పాదయాత్ర చేపట్టిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడంపై సీమాంధ్ర నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమైక్యాంధ్రను కోరుతూ నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర చేపట్టిన 53 మంది విద్యార్థులను పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. ఆ అరెస్టును సీమాంధ్ర నాయకులు ఖండిస్తున్నారు. విద్యార్థుల అరెస్టుకు నిరసనగా సమైక్యాంధ్ర విద్యార్థుల జెఎసి సోమవారం విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో సీమాంధ్రలోని 14 విశ్వవిద్యాలయాల విద్యార్థులు బంద్ ను పాటిస్తున్నారు. శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తున్న విద్యార్థులపై అరెస్టు చేశారని విద్యార్థుల జెఎసి కన్వీనర్ వెంకటరమణ విమర్సించారు.

శాంతియుతంగా పాదయాత్ర చేస్తూ గవర్నర్ కు వినతి పత్రం సమర్పించడానికి వెళ్తున్న విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తెలుగుదేశం నాయకులు దూళిపాళ్ల నరేంద్ర చౌదరి, కె. ఎర్రంనాయుడు విడివిడిగా ఖండించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు వెళ్లాలంటే పాస్ పోర్టు, వీసా కావాలా అని వారు అడిగారు. తమ విద్యార్థులు పాకిస్తాన్ వెళ్లడం లేదని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెళ్తున్నారని వారన్నారు. విద్యార్థుల అరెస్టును కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా ఖండించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X