వరంగల్ పొలికేకలో తీవ్రమైన లొల్లి

Polikeka
వరంగల్: వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆదివారం జరిగిన విద్యార్థుల పొలికేక రసాభాసగా మారింది. ఎమ్మార్పీయస్ నాయకుడు మందకృష్ణ వ్యాఖ్యలపై సభలో తీవ్ర వివాదం చెలరేగింది. తెలంగాణలో అగ్రవర్ణాల ఆధిపత్యం ఉందని మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. దీంతో వివాదం మొదలైంది. దీంతో ఒకరి ప్రసంగాన్ని మరొకరు ఆపుకున్నారు. పరస్పర వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో సభ గందరగోళంగా మారి అర్థంతరంగా ముగిసింది. మందకృష్ణపై నీటి ప్యాకెట్లు విసిరారు. ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్ పై దాడికి యత్నించారు. ఈ దాడిలో ఆయన చొక్కా చిరిగింది. తీవ్ర గందరగోళం చెలరేగడంతో విద్యార్థులు బారికేడ్లను ఛేదించుకుని పరుగులు తీశారు. పోలీసులు లాఠీచార్జీ చేశారు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో తనపై దాడికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కారణమని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తనకు కెసిఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘటనలో సమైక్యవాదుల కుట్ర ఉందని దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విభజన తేవడానికి సమైక్యవాదులు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఇది జరిగిందని ఆయన అన్నారు. సభలో లొల్లి వల్ల స్వామి అగ్నివేశ్ ప్రసంగించకుండానే వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+