వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవిపై తెలంగాణ కేసు నమోదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేశారంటూ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై రంగారెడ్డి జిల్లా ఇబ్రాహింపట్నం పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. సామాజిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని గత ఎన్నికల్లో ఓటర్లను నమ్మించి మోసం చేశారంటూ ఆయనపై ఐపిసి 420 సెక్షన్ కింద కేసు నమోదైంది. తెలంగాణ ప్రాంతం నుంచి 17 శాతం ఓట్లు పొంది చిరంజీవి ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన కాంగ్రెసు నాయకుడు వెదిరె చల్మారెడ్డి జనవరి 16న ఇబ్రహీంపట్నంలోని నాలుగో మెట్రోపాలిటన్ మున్సిఫ్ కోర్టులో కేసు వేశారు.

చల్మారెడ్డి వాదనలు విన్న తర్వాత మెజిస్ట్రేట్ జాన్సన్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 11వ తేదీన ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సంపత్ కుమార్ చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా చిరంజీవి సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకుని ఉద్యమాలకు దిగడంతో తెలంగాణలోని ప్రజారాజ్యం పార్టీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవిపై కేసు నమోదైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X