వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోనేరు రంగారావు కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

Koneru Ranga Rao
హైదరాబాద్: మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు సోమవారం సాయంత్రం కన్ను మూశారు. గత పది రోజులుగా హైదరాబాదులోని జూబిలీహిల్స్ అపోలోలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. ఆయన 1936 జులై 26వ తేదీన కృష్ణా జిల్లా గూడవల్లిలో జన్మించారు. న్యుమోనియాతో ఆయన మరణించినట్లు వైద్యులు చెప్పారు.

కాంగ్రెసులో రాష్ట్రం నుంచి ఆయన సీనియర్ సభ్యుడు. గూడవల్లి సర్పంచుగా పదేళ్ల పాటు పనిచేశారు. కంకిపాడు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై సాంఘిక సంక్షేమ మంత్రిగా నియమితులయ్యారు. వివిధ ముఖ్యమంత్రుల మంత్రివర్గాల్లో ఆయన పనిచేశారు. మున్సిపల్ అభివృద్ధి, దేవాదాయ, సాంఘిక సంక్షేమ శాఖలను ఆయన నిర్వహించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండు సార్లు తిరువూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.

భూసంస్కరణల కోసం ప్రభుత్వం వేసిన కమిటీకి ఆయన నేతృత్వం వహించారు. ఆయన సమర్పించిన నివేదికను ప్రభుత్వం అమలు చేయడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంది. నిష్పాక్షికంగా ఆయన రూపొందిచిన నివేదిక ప్రతిపక్షాల ప్రశంసలు అందుకుంది. కొనేరు రంగారావు కమిటీ నివేదికను అమలు చేయాలని ప్రతిపక్షాలు ఇప్పటికీ డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X