కోనేరు రంగారావు కన్నుమూత

Koneru Ranga Rao
హైదరాబాద్: మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు సోమవారం సాయంత్రం కన్ను మూశారు. గత పది రోజులుగా హైదరాబాదులోని జూబిలీహిల్స్ అపోలోలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. ఆయన 1936 జులై 26వ తేదీన కృష్ణా జిల్లా గూడవల్లిలో జన్మించారు. న్యుమోనియాతో ఆయన మరణించినట్లు వైద్యులు చెప్పారు.

కాంగ్రెసులో రాష్ట్రం నుంచి ఆయన సీనియర్ సభ్యుడు. గూడవల్లి సర్పంచుగా పదేళ్ల పాటు పనిచేశారు. కంకిపాడు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై సాంఘిక సంక్షేమ మంత్రిగా నియమితులయ్యారు. వివిధ ముఖ్యమంత్రుల మంత్రివర్గాల్లో ఆయన పనిచేశారు. మున్సిపల్ అభివృద్ధి, దేవాదాయ, సాంఘిక సంక్షేమ శాఖలను ఆయన నిర్వహించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండు సార్లు తిరువూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.

భూసంస్కరణల కోసం ప్రభుత్వం వేసిన కమిటీకి ఆయన నేతృత్వం వహించారు. ఆయన సమర్పించిన నివేదికను ప్రభుత్వం అమలు చేయడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంది. నిష్పాక్షికంగా ఆయన రూపొందిచిన నివేదిక ప్రతిపక్షాల ప్రశంసలు అందుకుంది. కొనేరు రంగారావు కమిటీ నివేదికను అమలు చేయాలని ప్రతిపక్షాలు ఇప్పటికీ డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+