హైదరాబాద్ ఫ్రీజోన్ కాదు: రోశయ్య

ప్రతిపక్షాల కన్నా ప్రభుత్వం స్పష్టంగా ఉందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఫ్లోర్ లీడర్ల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులను మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం ప్రతిపాదిస్తే సమస్య పరిష్కారమవుతుందని అనుకుంటే ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అందుకు సంబంధించి రేపు గురువారం ఉదయమే తీర్మానం ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. శాసనసభలో తీర్మానం ప్రతిపాదించడం వల్ల సమస్య పరిష్కారం కాదనేది తన ఉద్దేశమని, సమస్య పరిష్కారానికి సాయంత్రం ఫ్లోర్ లీడర్ల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామనేది తన ఉద్దేశమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications