ఏలూరు: చేతబడి నెపంతో పశ్చిమ గోదావరి జిల్లా ఉడ్రాజవరం గ్రామస్తులు దారుణానికి పాల్పడ్డారు. ఆరుగురు వ్యక్తులపై వారు దాడి చేశారు. ఆ ఆరుగురు చేతబడి చేస్తున్నారనే అనుమానంతో వీరు ఈ దారుణానికి పాల్పడ్డారు. వారి పళ్లు పీకేశారు, తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన హోంగార్డుపై కూడా గ్రామస్థులు దాడి చేశారు.
ఈ దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలోని 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుంది. దాదాపు వంద మంది గ్రామస్థులు ఈ దారుణానికి పాల్పడినట్లు చెబుతున్నారు.