పాక్ ఐఎస్ఐతో లగడపాటికి లింక్: రేవంత్

Revanth Reddy
హైదరాబాద్: పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ ఐకి కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఏజెంటుగా మారారని తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యను తెలుగుదేశం ప్రతినిధి బృందం కలిసిన తర్వాత గురువారం రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఐఎస్ఐకి లగడపాటికి మధ్య గల సంబంధాలను ప్రభుత్వం బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఐఎస్ఐ ఎజెండాను అమలు చేయడానికి లగడపాటి ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఐఎస్ఐ ఎజెండాలో భాగంగానే తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ ఐఎస్ఐ అడ్డాగా మారుతుందని లగడపాటి అంటున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడానికి లగడపాటి వ్యూహరచన చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. లగడపాటికి కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నా పార్టీ అన్నా ఖాతరు లేదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఒక జోక్ గా లగడపాటి రాజగోపాల్ కొట్టిపారేశారు. తెలుగుదేశం పార్టీ మతతత్వ పార్టీ జత కట్టిందని, అటువంటి పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తాను పట్టించుకోబోనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+