నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 12,200 కోట్ల రూపాయలతో నెల్లూరు పట్టణాభివృద్ధి కార్యక్రమాలను ఆమోదించారని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి అన్నారు. అటువంటి వైఎస్ ను నెల్లూరు సీమ మరిచిపోదని అన్నారు. ఆనం వైఎస్ కు అత్యంత సన్నిహితుడని తెలిసిందే. వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావాలని బహిరంగ ప్రకటనలు చేసిన అతికొద్ది మంత్రుల్లో ఆనం ఒకరు.
మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చేందుకు సర్వే చేపడతామని, బినామీ రేషన్కార్డుల ఏరివేతకు పటిష్టమైన చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. 2011 మార్చి నెలాఖరులోగా కొత్త మున్సిపాలిటీలు ఏర్పడవని ఆయన అన్నారు.