వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాఖమూరి డైరీ మా వద్దలేదు: ఎస్పీ

By Santaram
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన శాఖమూరి అప్పారావు, టెక్‌ రమణల వివరాలు తమ వద్ద లేవని రూరల్‌ ఎస్పీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ స్పష్టం చేశారు. శాఖమూరికి చెందిన డైరీ తమ వద్ద ఉన్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. శాఖమూరి గతంలో జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనల్లో పాల్గొన్నట్టు గణాంకాలున్నాయి తప్ప అతడి ఆయుధాలు, పత్రాలేవీ తమ వద్ద లేవన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఎస్పీ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొందని ఎస్పీ చెప్పారు.

మావోయిస్టులు గత మూడునెలలుగా స్తబ్దుగా ఉండడంపై తాము కూడా కొన్ని వూహాత్మక ప్రణాళి కలు సిద్ధం చేసుకు న్నామన్నారు. బలి మెల, కలిమెల తదితర ముఖ్య కూడళ్లలో నిఘాను మరింత పెంచేందుకు ఒరిస్సా రాష్ట్ర పోలీస్‌ సిబ్బందితో కలిసి సంయుక్తంగా దాడులు జరిపేందుకు సన్నహాలు పూర్తయ్యాయన్నారు.

ఏఓబీలో మావోయిస్టు కేంద్ర, రాష్ట్ర కమిటీ ముఖ్య సభ్యులెవరూ లేరని ఎస్పీ చెప్పారు. ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ను దృష్టిలో పెట్టుకుని నాయకులంతా ఏజె న్సీలో ఆశ్రయం పొందుతున్నారన్న వదంతులను నమ్మవద్దన్నారు. గిరిజన యువతులను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు వచ్చిన వార్తలకు స్పందించి ప్రత్యేకంగా ఉమెన్‌ ట్రాఫికింగ్‌ సెల్‌ ఏర్పాటు చేశామన్నారు. అమాయకులైన గిరిజన యువతను మావోయిస్టులు తప్పుదారి పట్టిస్తున్నారని, మిలీషియా సభ్యులకు తాము కౌన్సెలింగ్‌ ఇస్తున్నామని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X