రామోజీపై చర్యలు తప్పవని చెప్పాలి: ఉండవల్లి

Undavalli Arun Kumar
హైదరాబాద్: అక్రమాలకు పాల్పడిన ఈనాడు గ్రూపు సంస్థ మార్గదర్సి ఫైనాన్షియర్స్ అధినేత రామోజీరావుపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రజలకు ప్రభుత్వం నమ్మకం కలిగించాల్సి ఉంటుందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అందుకే తాను ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈనాడు, ఈటీవిని అడ్డం పెట్టుకుని తనను వ్యతిరేకించేవారి చాప్టర్లను రామోజీ రావు క్లోజ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. మీడియా ఉండడం వల్లనే అక్రమాలకు పాల్పడినా ఎవరూ చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. ఉన్మాది వచ్చాడని చెప్తే ప్రజలు భయపడుతారని, ఉన్మాది ఎదురు పడాల్సిన అవసరం లేదని, రామోజీపై కూడా ప్రజల భయాలు అదే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కె. రోశయ్య తనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇన్ని రోజులు తనకు ఎందుకు చెప్పలేదని అతి మామూలుగానే ముఖ్యమంత్రి అడిగారని, దాన్ని మీడియా భూతద్దంలో చూపించిందని ఆయన అన్నారు. తమ మధ్య సంభాషణ చాలా సాదాగా జరిగిందని ఆయన చెప్పారు. ఏం జరిగిందనే విషయంపై తాను ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రులకు లేఖలు రాయడం కొత్తేమీ కాదని, వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16 లేఖలు రాశానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రికి రాసిన లేఖల్లోని అంశాలు ప్రజలుకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే మీడియాకు విడుదల చేశానని ఆయన చెప్పారు. ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉన్నందున్నే తాను లేఖను మీడియాకు విడుదల చేసినట్లు చెప్పారు. గత ఆరు నెలల నుంచి కలుస్తున్నావు కదా, ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదని మాత్రమే సిఎం తనను అడిగినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+