రక్త పిశాచులైన భార్యాభర్తల అరెస్ట్

దీంతో జాలి పడిన సదరు విద్యార్థులు పెద్ద మనసుతో రక్తదానం చేయడానికి అంగీకరిస్తారు. విద్యార్థులతో నేరుగా బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి రక్తం ప్యాకెట్ ను తీసుకుంటాడు. కళ్లల్లో నీళ్లతో వారికి కృతజ్ఞతలు చెబుతాడు. పేదోడిని బాబూ..అంటూ రక్తదానం సమయంలో అయ్యే ఖర్చును కూడా విద్యార్థుల నుంచి వసూలు చేస్తుంటాడు. ముఖ్యంగా ఏయూకు చెందిన విద్యార్థులనే ఆ వ్యక్తి ఎక్కువగా ఆశ్రయిస్తాడు.
నర్సీపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన కె.సునీల్కుమార్ నిత్య వ్యాపకం. అతని భార్య లత కూడా 'భర్తకు తగ్గ భార్య' అనిపించుకుంది. కొంచెం నటించి సుళువుగా డబ్బులు సంపాదిస్తున్న భర్తనే ఆదర్శంగా తీసుకుంది. ఆమె కూడా విద్యార్థుల వద్దకు వెళ్లి 'రక్తం అవసరమని' మొసలి కన్నీరు కార్చింది. అయితే ఇలా తరచూ రక్తం కోసం రావడంతో సునీల్కుమార్పై విద్యార్థులకు అనుమానం కలిగింది.
రక్తం అవసరమని పరిచయం చేసిన వ్యక్తులను ఆరా తీయగా..వారికి అధిక మొత్తానికి విక్రయిస్తున్నాడని తెలిసింది. దీంతో సిద్ధార్థ హాస్టల్ లో ఉంటున్న బీఈడీ విద్యార్థి శ్రీనివాసరావు అసలు బండారాన్ని బయటపెట్టాడు. రక్తం అడగడానికి వచ్చిన సునీల్కుమార్ను మరి కొందరి విద్యార్థులతో కలిసి పట్టుకున్నాడు. అనంతరం మూడో పట్టణ పోలీసు స్టేషన్కు అప్పగించారు. సునీల్తో పాటు అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ కృష్ణవర్మ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications