రక్త పిశాచులైన భార్యాభర్తల అరెస్ట్

దీంతో జాలి పడిన సదరు విద్యార్థులు పెద్ద మనసుతో రక్తదానం చేయడానికి అంగీకరిస్తారు. విద్యార్థులతో నేరుగా బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి రక్తం ప్యాకెట్ ను తీసుకుంటాడు. కళ్లల్లో నీళ్లతో వారికి కృతజ్ఞతలు చెబుతాడు. పేదోడిని బాబూ..అంటూ రక్తదానం సమయంలో అయ్యే ఖర్చును కూడా విద్యార్థుల నుంచి వసూలు చేస్తుంటాడు. ముఖ్యంగా ఏయూకు చెందిన విద్యార్థులనే ఆ వ్యక్తి ఎక్కువగా ఆశ్రయిస్తాడు.
నర్సీపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన కె.సునీల్కుమార్ నిత్య వ్యాపకం. అతని భార్య లత కూడా 'భర్తకు తగ్గ భార్య' అనిపించుకుంది. కొంచెం నటించి సుళువుగా డబ్బులు సంపాదిస్తున్న భర్తనే ఆదర్శంగా తీసుకుంది. ఆమె కూడా విద్యార్థుల వద్దకు వెళ్లి 'రక్తం అవసరమని' మొసలి కన్నీరు కార్చింది. అయితే ఇలా తరచూ రక్తం కోసం రావడంతో సునీల్కుమార్పై విద్యార్థులకు అనుమానం కలిగింది.
రక్తం అవసరమని పరిచయం చేసిన వ్యక్తులను ఆరా తీయగా..వారికి అధిక మొత్తానికి విక్రయిస్తున్నాడని తెలిసింది. దీంతో సిద్ధార్థ హాస్టల్ లో ఉంటున్న బీఈడీ విద్యార్థి శ్రీనివాసరావు అసలు బండారాన్ని బయటపెట్టాడు. రక్తం అడగడానికి వచ్చిన సునీల్కుమార్ను మరి కొందరి విద్యార్థులతో కలిసి పట్టుకున్నాడు. అనంతరం మూడో పట్టణ పోలీసు స్టేషన్కు అప్పగించారు. సునీల్తో పాటు అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ కృష్ణవర్మ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications