సీమాంధ్రతో పొత్తు కుదరదు: దామోదర్

R Damodar Reddy
న్యూఢిల్లీ: తెలంగాణ, సీమాంధ్రల మధ్య ఎన్నటికీ పొత్తు కుదరదని కాంగ్రెసు తెలంగాణ సీనియర్ శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి అన్నారు. శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ప్రజాప్రతినిధుల తరఫున నివేదిక సమర్పించిన తర్వాత ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత 50 ఏళ్లలో ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలు కలవలేదని, కలుస్తాయని భావించామని, అయితే అది జరగలేదని ఆయన అన్నారు. సాంస్కృతికంగా కూడా ఇరు ప్రాంతాల మధ్య సారూప్యత లేదని ఆయన చెప్పారు. ఇరు ప్రాంతాల దేవతల మధ్య కూడా తేడా ఉందని ఆయన చెప్పారు. తాము ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ లాంటి గ్రామదేవతలను పూజిస్తే సీమాంధ్ర ప్రజలు గాయత్రి, జగదాంబ వంటి దేవతలను పూజిస్తారని ఆయన చెప్పారు.

గత యాభై ఏళ్ల కాలంలో న్యాయ, సాగునీటి వంటి అన్ని రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన చెప్పారు. ఈ విషయాలన్నీ తాము శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన నివేదికలో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. విడిపోతే తప్ప తమకు న్యాయం జరగదని ఆయన అన్నారు. మానసికంగా ఇరు ప్రాంతాల ప్రజల మధ్య ఐక్యత సాధ్యం కాలేదని, దాని వల్ల ఎప్పటికప్పుడు ఉద్యమాలు వస్తున్నాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+