హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు విధానాలపై టిడీపి సైకిల్ యాత్ర

By Santaram
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ ఆందోళన పథం చేపట్టనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరుల ఆలోచనే తప్ప ప్రజాసంక్షేమం పట్టడం లేదని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. సర్కారు వైఫల్యం వల్లే ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. దీనిపై నిరసన తెలుపుతూ ఈనెల 27న దేశవ్యాప్తంగా వామపక్షాలు హర్తాళ్‌ చేస్తున్నాయని దీన్ని జయప్రదం చేసేందుకు అన్ని పార్టీలు కలిసిరావాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెసు‌ ఏకపక్ష విధానాలపై పోరాడేందుకు టీడీపీ, వామపక్షాలు గురువారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్ ‌లో భేటీ అయ్యాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, సీపీఐ కార్యదర్శి నారాయణ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నేత మురళీధర్‌ దేశ్‌ పాండే, ఆర్‌ఎస్‌టీ నేత జానకిరామ్‌ ఈ భేటీలో పాల్గొన్నారు.అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ హర్తాళ్‌ కు ముందుగా తాము 24నుంచి సైకిల్ ‌యాత్రలు నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచుతామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X