తక్షణ సాయం అందించండి: రోశయ్య
ఓ వైపు ఎండలు మండిపోతుంటే మరో వైపు రాష్ట్రంలోని 11 జిల్లాలను అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాలు బుధవారం రాత్రి అంధకారబంధురమైపోయాయి. అనేక చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలాయి. బుధవారంనాడు వడదెబ్బకు ఇద్దరు మరణించగా, వర్షాలవల్ల మొత్తం ఏడుగురు ఏడుగురు మరణించినట్టు సమాచారం.
బుధవారంనాడు బీహార్ నుంచి తమిళనాడు వరకు బలహీన అల్పపీడన ద్రోణి ఏర్పడడంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వ ర్షాలు కురిస్తే, మరికొన్ని చోట్ల వగడళ్ల వాన కురిసింది. ప్రకాశంలో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు పిడుగుపాటుకు మరణించగా, గుంటూరు, నెల్లూరు, కడప జిల్లాలలో ఒక్కొక్కరు పిడుగుపాటుకు మరణించారు.
Comments
Story first published: Thursday, April 22, 2010, 9:17 [IST]