నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ తో జై తెలంగాణ అనిపించా: డిఎస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Srinivas
నిజామాబాద్‌: తెలంగాణ విషయంలో తాను స్పష్టమైన వైఖరితో ఉన్నానని, ఇదే విషయంపై తనకు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితో కూడా విభేదాలు వచ్చాయని, అలాంటాయన నోటితోనే జై తెలంగాణ అనిపించానని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ అన్నారు. నిజామాబాద్‌లో రైస్‌మిల్లర్స్‌ భవన్‌ లో ఆయనను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఆయన ఆ విధంగా అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం ఆందోళన చేసేవారిపట్ల తనకు సానుభూతి ఉందని, ఓ తెలంగాణవాదిగా గర్వపడుతున్నానని అన్నారు. సీపీఎం మినహా రాష్ట్రంలో ఉన్న అన్నిపార్టీలన్నీ తెలంగాణను కోరుకుంటున్నాయని అన్నారు.

పీసీసీ అధ్యక్ష పదవిలో ఉండి తెలంగాణకుఅనుకూలమైన నివేదిక ఇస్తే సీమాంధ్ర నేతలనుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే ఉద్దేశంతోనే శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వటంలేదని చెప్పారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం మనస్సులో ఏముందో తెలుసని, తెలంగాణ వచ్చితీరుతుందని ఆయన అన్నారు. తెలంగాణ నినాదంతో ఉన్న పార్టీలన్నీ పోట్లాడుకోవటం సరికాదని, దాంతో ప్రజలముందు చులకనవటమే తప్ప వేరే ప్రయోజనం ఉండదని డీఎస్‌ అన్నారు. తెరాస శ్రేణులు జై తెలంగాణన అని నినదించాలని శ్రీనివాస్ ను డిమాండ్‌ చేశాయి. వెంటనే ఆయన జై తెలంగాణ జైజై అంటూ నినదించారు. దీంతో తెరాస నాయకులు ఆందోళన విరమించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X