హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఇవ్వకపోతే హింసే: నాగం

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ ఇవ్వకపోతే హింస తప్పదని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. శాంతియుత ఉద్యమం ద్వారా న్యాయం జరగకపోతే అది హింసాత్మక రూపం తీసుకుంటుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే అంతర్యుద్ధం తప్పదన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్న మాటలపై స్పందిస్తూ అంతర్యుద్ధం సంగతేమో గానీ ప్రజలు భావోద్రేకాలకు గురి కావడం ఖాయమని ఆయన అన్నారు.

తమ పార్టీ తెలంగాణ నేతలంగా తెలంగాణ కోసం చిత్తశుద్ధితో ఉన్నామని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ 1956 నుంచి లెక్కలు అడిగితే 1994నుంచి మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం చెప్పడం సరి కాదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసే విషయంపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X