కోత తీర్మానం: గట్టెక్కనున్న యుపిఎ

Manmohan Singh
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు ప్రతిపాదించే కోత తీర్మానం నుంచి ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వం సులభంగానే గట్టెక్కే అవకాశం ఉంది. ప్రతిపక్షాల అనైక్యత యుపిఎ ప్రభుత్వానికి వరంగా మారుతోంది. అధిక ధరలపై కోత తీర్మానం ప్రతిపాదించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. దీని నుంచి బయటపడుతామని యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విశ్వాసంతో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బిఎస్పీ నేత మాయావతి తాము ప్రభుత్వానికి అండగా నిలుస్తామని చెప్పారు. బిజెడి కూడా ప్రభుత్వానికి మద్దతివ్వాలని నిర్ణయించింది. ఇలా యుపిఎ ప్రభుత్వానికి మద్దతు పెరుగుతూ వస్తోంది.

ఆర్థిక బిల్లు ఆమోదం కాకుండా కోత తీర్మానం ప్రతిపాదించాలనే నిర్ణయానికి బిజెపి నేతృత్వంలోని ఎన్డీయె, వామపక్షాలు కట్టుబడి ఉన్నాయి. ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి అవసరమైన సంఖ్యాబలం ప్రతిపక్షాలకు లేదని కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. తాము కోత తీర్మానాన్ని ఓడించగలమని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తాము సిద్దంగా లేమని సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్, ఆర్జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ సూచనలు చేశారు. చర్చ లేకుండా వోటింగ్ కు తాము వ్యతిరేకమని ఆ ఇద్దరు నాయకులు అంటున్నారు.

ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తమకు లేదని, దాని దయనీయ స్థితిని ఎత్తిచూపడమే తమ ఉద్దేశమవి బిజెపి నాయకుడు రాజీవ్ ప్రతాఫ్ రూడీ అన్నారు. కోత తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్న బిఎస్పీకి 21 మంది సభ్యుల బలం ఉంది. 543 మంది సభ్యులున్న సభల సాధారణ మెజారిటీకి 272 మంది సభ్యుల మద్దతు అవసరం. యుపిఎకు 265 మంది సభ్యుల మద్దతు ఉంది. ప్రస్తుత స్థితిలో మాయావతి మద్దతుతో యుపిఎ ప్రభుత్వం సులభంగా బయట పడే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+