ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు: కెకె

Keshav Rao
న్యూఢిల్లీ: జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని కాంగ్రెసు జార్ఖండ్ వ్యవహారాల ఇంచార్జీ కె. కేశవరావు అన్నారు. జెఎంఎం నేత శిబూ సొరేన్ కు బిజెపి మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆయన బుధవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి చర్చించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. జార్ఖండ్ లో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు తాము సహకరిస్తామని ఆయన చెప్పారు. రాజకీయాల్లో ఎవరు కూడా అస్పృశ్యులు కారనే వైఖరికి తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెప్పారు.

శిబూ సొరేన్ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటు తాము వ్యతిరేకమనే గత వైఖరికి కట్టుబడి ఉన్నారా అని మీడియా ప్రతినిధులు అడిగితే రాజకీయాల్లో చివరి మాట ఏదీ ఉండదని ఆయన జవాబిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు కోసమే తాము ఎన్నికల్లో పోటీ చేశామని, అందువల్ల ప్రభుత్వ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. సుస్థిరత అనేది సంఖ్యాబలం వల్ల సాధ్యం కాదని, నాయకుడి వల్ల సాధ్యమవుతుందని ఆయన అన్నారు. న్యాయబద్దందా శిబూ సొరేన్ తమకు పార్లమెంటులో ఓటు చేశారని ఆయన అన్నారు. ఎన్నికల ముందు సొరేన్ తో తమకు పొత్తు ఉందని, సొరేన్ యుపిఎలో భాగస్వామి అని, ఇద్దరు ఎంపీలు తమకు బయటి నుంచి మద్దతిస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+