ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రాక్టర్ ప్రమాదంలో 20 మందికి గాయాలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Khammam dist
ఖమ్మం: ఖమ్మం జిల్లా అశ్వాపురం సమీపంలో బుధవారం ఉదయం ఉపాధి హామీ కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

నిన్న జరిగిన ప్రమాదం వివరాలు: కల్లూరు మండల పరిధిలోని మగ్గువెంకటాపురం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రామానికి చెందిన చి లకా వెంకటేశ్వరరావు, పిట్టల విశ్వనాథం మంగళవారం రాత్రి పేరువంచ గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై వె ళ్తుండగా తిరువూరు వైపు వెళ్తున్న ఐషర్‌ వ్యాన్‌(ఎపి 36 వై 4337) ఢీకొట్టింది. దీంతో చిలకా వెంకటేశ్వరరావు(40) అక్కడిక్కడే మృతి చెందగా, విశ్వనాథం తీవ్రంగా గాయపడ్డాడు. సొసైటీ అధ్యక్షునిగా కొనసాగుతున్న వెంకటేశ్వరరావుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X