ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒంగోలు టు గూగుల్-31 మంది ఎంపిక

By Santaram
|
Google Oneindia TeluguNews

Google
ఒంగోలు: ప్రపంచప్రఖ్యాత ఐటి సంస్థ 'గూగుల్‌' ఒంగోలు రావ్‌ అండ్‌ నాయుడు ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన రిక్రూట్ ‌మెంట్‌ డ్రైవ్ ‌లో కళాశాలకు చెందిన 31 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కళాశాలకు చెందిన 200 మంది బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు హాజరవగా రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా 31 మందిని ఎంపిక చేశారు.

అతి పెద్ద బహుళజాతి సంస్థ అయిన గూగుల్‌ను కళాశాలకు ఆహ్వానించినందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కళాశాల చైర్మన్‌ మాటూరి వెంకటరావు, కార్యదర్శి ఎం. నాగసందీప్‌ లను అభినందించారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్‌ కోసం మరికొన్ని అంతర్జాతీయ సంస్థల రిక్రూట్‌ మెంట్‌ డ్రైవ్‌ లు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెంకట్రావు, నాగసందీప్‌ లు తెలిపారు. క్యాంపస్‌ డ్రైవ్‌ కోసం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు కార్యదర్శి ఎం. నాగసందీప్‌ చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీఎస్ ‌వీ శ్రీనివాసరావు, డైరెక్టర్‌ డాక్టర్‌ బి. వెంకటేశ్వర్లు, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ వి. సాంబశివరాజు, ఏజీఓ అంజిరెడ్డి, పీఆర్‌ఓ కె ఓబుల్‌ రెడ్డి పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X