సెంట్రల్ జైలులో శ్రీనివాస కల్యాణం

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు రౌతు సూర్యప్రకాశరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారాగారం నాలుగుగోడల మధ్య, స్వేచ్ఛా ప్రపంచానికి దూరంగా జీవిస్తున్న ఖైదీల సమక్షంలో శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ వేడుక జరపడం అభినందనీయమన్నారు. ఖైదీలలో భక్తి భావాలు పెంపొందించి సన్మార్గానికి మళ్లే అవకాశాన్ని టీటీడీ కల్పించిందని ఎమ్మెల్యే రౌతు పేర్కొన్నారు. జైలు సూపరింటెండెంట్ ఏజీ సాయినాథరెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్లు ఫజల్హక్, వరప్రసాద్, జైలర్ వెంకటరాజు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications