వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖను వణికిస్తున్న సూర్యుడు

By Santaram
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: సముద్రతీరంలో పచ్చని ప్రకృతి అందాల మధ్య ఉండే విశాఖ నగరానికి కూడా మండు వేసవి దెబ్బ తప్పలేదు. వేసవి ఎండ ఎలా ఉంటుందో నగర వాసులకు తెలిసివస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతంగా అదరగొట్టింది. నిప్పుల వానను తలపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కుతకుతలాడించింది. ఎండకు వడ దెబ్బ కూడా తోడైంది. అదే పనిగా వేడి గాలులను వెదజల్లుతూనే ఉంది. ఆకాశంలో మేఘాలు లేకపోవడంతో సూర్యరశ్మి నేరుగా పడడంతో వేడెక్కిన భూమి ఉష్ణతీవ్రతను మొదలెట్టింది. ఫలితంగా నగరంలో 39.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

ఈ సీజనులో ఇదే అత్యధికం కావడం విశేషం. ఇప్పటిదాకా ఈ సీజనులో 38.6 డిగ్రీలే గరిష్టం. దాదాపు 40 డిగ్రీలకు ఉష్ణ్రోగత చేరుకోవడంతో జనం అల్లాడిపోయారు. బయటకు రావడానికే భయకంపితులయ్యారు. చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. నగరంలోని రోడ్లు చాలా వరకు నిర్మానుష్యంగా కనిపించాయి. సాయంత్రం కాస్త చల్లబడ్డాకా రోడ్లపైకి నెమ్మదిగా జనసంచారం మొదలయ్యింది. వేసవి తాపాన్ని తాళలేక పెద్ద ఎత్తున సాగరతీరానికి వెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X