వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను తెలంగాణలో అడ్డుకోరు: చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తిరువూరు: పోలవరం ప్రాజెక్టుపై తాను చేపట్టిన బస్సు యాత్రను తెలంగాణ ప్రాంతంలో అడ్డుకుంటామని అక్కడి ప్రజలు అనటం లేదని, రాజకీయ లబ్ధి పొందాలనుకునేవారు, తమ అస్థితరత కోల్పోతామని భావించే వారే అడ్డుకుంటామని ప్రకటిస్తున్నారని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. తెలంగాణ విషయంలో తమ పార్టీ వైఖరి ఇప్పటికే స్పష్టంగా చెప్పామని, యాత్రను అడ్డుకుంటామని అక్కడి ప్రజలు ప్రకటిస్తే వారికి సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. ఆయన ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

ఏ ఉద్యమమైనా గల్లి నుంచే ప్రారంభమవుతుందన్న విషయం గుర్తించుకుని అధికార పార్టీ నాయకులు మాట్లాడాలని సూచించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు హామీలు గుప్పించిన వారికి కనువిప్పు కలిగించేందుకే ఈ ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. పిట్టకథల మాదిరిగా చెబుతున్న వట్టిమాటలను కట్టిపెట్టి కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతూ కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నాలు చేశారని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు సంతృప్తికర ప్యాకేజి ప్రకటించటంతోపాటు ముంపువల్ల ఎక్కడైతే ఎక్కువగా నష్టపోతారనుకున్నారో వారందరికీ న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

పోలవరం ప్రాజెక్టు సాధన యాత్ర పేరిట విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో నిరంతరాయంగా పర్యటిస్తున్న ప్రరాపా అధినేత చిరంజీవి ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. మండుటెండల్లో అవిశ్రాంతంగా ఆయన పర్యటించటం వల్ల జలుబు, దగ్గుతోపాటు జ్వరంతో బాధపడుతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X