వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పసిడి కంటే ప్రియంగా పెసరపప్పు
గత ఏడాది పెసర సాగు గణనీయంగా తరిగి పోవడం, అక్కడక్కడా వేసిన పంట కూడా ఆశించిన రీతిలో దిగు బడి ఇవ్వకపోవడం తదితర కారణాలతో పెసరపప్పు మార్కెట్లోకి రావడం అరుదై పోయింది. పొరుగు రాష్ట్రాలలో సైతం పెసర దిగుబడి సాధారణ స్థాయికంటే 50 శాతానికి పడిపోయింది.
ఇక మిగిలిన పప్పు ధాన్యాల పరిస్థితి దాదాపు అదే విధంగా ఉంది. మినప్పప్పు ధరలు గత జనవరిలో బాగా తగ్గినట్లనిపించి నప్పటికీ రెండు నెలలుగా వీటి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. కిలో మినప్పప్పు ధర నేడు మార్కెట్లో 76 రూపాయలకు చేరుకుంది. గత ఏడాది ఎన్నికల సీజన్లో దడ దడలాడించిన కంది పప్పు ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు. ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీలు కల్పించి కంది పంట సాగును ప్రోత్సహించింది.పప్పు ధరలు మండిపోతున్నాయి. అంతే కాదు చాలా ప్రదేశాల్లో పెసరపప్పు కంటికి కన్పించడం లేదు.
Comments
Story first published: Wednesday, May 26, 2010, 11:07 [IST]