వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకాళహస్తి రాజగోపురం కింద 3 మృతదేహాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Srikalahasthi Rajagopuram
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి రాజగోపురం శిథిలాల కింద మూడు మృతదేహాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. శనివారం ఒక మృతదేహం బయటపడింది. మరో రెండు మృతదేహాలు ఇంకా శిథిలాల కింద ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. శ్రీకాళహస్తి రాజగోపురం మూడు రోజుల కింద కూలిపోయింది. అప్పటి నుంచి ముగ్గురు కనిపించకుండా పోయారు. రాజా అనే వ్యక్తి అప్పటి నుంచి కనిపించడం లేదు. బయటపడిన మృతదేహం ఎవరదినేది ఇంకా తేలలేదు.

రాజగోపురం శిథిలాలను గత మూడు రోజులుగా నాలుగు ప్రొక్లెయిన్లతో తొలగిస్తున్నారు. శిథిలాలను పూర్తిగా తొలగించడానికి మరో మూడు నాలుగు రోజులు పట్టవచ్చునని భావిస్తున్నారు. రాజాతో పాటు మరో ఇద్దరు మహిళలు శిథిలాల కింద మరణించి ఉంటారని భావిస్తున్నారు. రాజా కుటుంబ సభ్యులు గత రెండు రోజులుగా ప్రమాదం జరిగిన చోట కాచుకుని ఉన్నారు. ఒక మృతదేహం బయటపడడంతో శిథిలాల తొలగింపు పనులు ఆపేశారు. పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X