హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓదార్పు అనుమతికి వైయస్ జగన్ ఆఖరు ఆస్త్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కడప నియోజక వర్గం పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రపై చివరి అస్త్రాన్ని ప్రయోగించనున్నాట్లు సమాచారం. పార్టీ అధిష్టానాన్ని అనుమతి కోరేందుకు వైఎస్ కుటుంబ సభ్యులందరూ ఢిల్లీకి వెళ్ళి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి కోరనున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో జగన్ ఢిల్లీకి వెళ్లే ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ వైఎస్ వివేకానందరెడ్డి, కడప మేయర్ రవీంధ్రనాథ్ రెడ్ది జగన్ తో పాటు ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది.

జగన్ మాత్రం ఓదార్పు యాత్రను కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లాలో జరిగే యాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. కొండా సురేఖ దంపతులు, శానససభ్యులు అదినారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డితో జరిగిన చర్చల్లో ఈ మేరకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. జగన్ ను మంత్రి, బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా కలిశారు. జగన్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X