వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓదార్పు యాత్ర వాయిదాకు వైయస్ జగన్ యోచన

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్రను వాయిదా వేసుకునే ఆలోచనలో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓదార్పు యాత్రను చేపట్టడం వల్ల సంభవించే పరిణామాలపై సన్నిహిత శాసనసభ్యులు, నాయకులు ఆందోళనకు గురవుతుండంతో ఆయన వాయిదాకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా మొండిగా ముందుకు పోవడం వల్ల నష్టం జరుగుతుందని, ఆ నష్టానికి తాము సిద్ధంగా లేమని శాసనసభ్యులు జగన్ తో చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే చివరి నిమిషం వరకు పార్టీ అధిష్టానం నుంచి అనుమతి సాధించేందుకు ప్రయత్నాలు మాత్రం సాగించాలని అనుకుంటున్నారు. అధిష్టానం అనుమతి లభిస్తుందనే ఆశ కూడా జగన్ కు ఉన్నట్లు చెబుతున్నారు. కొందరు మంత్రులు శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తన ఓదార్పు యాత్రకు అనుకూలంగా మాట్లాడడం ఆయనకు కొంత ఊరటనిస్తోంది. పార్టీ అధిష్టానం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే జగన్ ఆదివారం సాయంత్రం గానీ, సోమవారం ఉదయం గానీ యాత్రను వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. జగన్ ఓదార్పు యాత్రను వాయిదా వేసుకోవడమే మంచిదని ఆయనకు అత్యంత సన్నిహితుడైన శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి కూడా అన్నారు. దీన్ని బట్టి శాసనసభ్యుల మనోగతాన్ని అర్థం చేసుకోవవచ్చునని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X