వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓదార్పు యాత్ర ఆపితేనే జగన్ తో సోనియా భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి తలపెట్టిన ఓదార్పు యాత్రను అపితే తప్ప కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తో మాట్లాడడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ సోనియాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే, పార్టీ అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటానని జగన్ ప్రకటన చేయాల్సి ఉంటుందని, అప్పుడే జగన్ తో ఏమైనా మాట్లడడానికి ఉంటుందని సోనియా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

జగన్ తమ హద్దు దాటితే కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. జగన్ తనను కలవడానికి వస్తున్నాడని సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ చెప్పినప్పుడు అతన్ని ప్రోత్సహించవద్దని కేంద్ర ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ వ్యవహారంపై జోక్యం చేసుకోవద్దని అధిష్టానం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి)కి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ జగన్ వ్యవహారంపై ఏమీ మాట్లాడడం లేదు. అది తమ పార్టీ అంతర్గత వ్యవహారమని ఆయన అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X