వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓదార్పు యాత్ర ఆపితేనే జగన్ తో సోనియా భేటీ
జగన్ తమ హద్దు దాటితే కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. జగన్ తనను కలవడానికి వస్తున్నాడని సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ చెప్పినప్పుడు అతన్ని ప్రోత్సహించవద్దని కేంద్ర ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ వ్యవహారంపై జోక్యం చేసుకోవద్దని అధిష్టానం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి)కి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ జగన్ వ్యవహారంపై ఏమీ మాట్లాడడం లేదు. అది తమ పార్టీ అంతర్గత వ్యవహారమని ఆయన అంటున్నారు.
Story first published: Saturday, June 5, 2010, 11:39 [IST]