హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి ఎడమొహం పెడమొహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Daggubati Venkateswara Rao
హైదరాబాద్: తోడల్లుళ్లు నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఎడమొహం పెడమొహంగానే వ్యవహరించారు. వారిద్దరి మధ్య సంబంధాలు లేవనే విషయం గురువారం మరోసారి బయటపడింది. సినీ నటుడు, బావ మరిది బాలకృష్ణ జన్మదిన వేడుకలకు వారిరువురు హాజరయ్యారు. వారిద్దరు బాలయ్య జన్మదిన వేడుకల్లో పలకరించుకోలేదు కూడా. స్వర్గీయ ఎన్టీ రామారావు హయాంలో ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగాయి. ఎన్టీఆర్ ను తొలగించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిద్దరి మధ్య వైరం చోటు చేసుకుంది.

ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేశ్వర రావు కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. ఆయన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. చంద్రబాబు మాత్రం తెలుగుదేశం పార్టీని నడుపుతున్నారు. చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాల మధ్య వైరం కొనసాగుతూనే ఉందని గురువారం నాటి సంఘటన మరోసారి రుజువు చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X