హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ప్రజల చీలికకు సీమాంధ్ర నేతల కుట్ర: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను చీల్చిందుకు సీమాంధ్ర రాజకీయ నాయకులు కుట్ర చేస్తున్నారని తెలంగాణ రాజకీయ జెఎసి కన్వీనర్ కోదండరామ్ విమర్శించారు. తెలంగాణలో ప్రజలంతా సంఘటితంగా ఉన్నారని, అలాగే నాయకులు కూడా ఒకే మాటపై ఉంటూ తెలంగాణ కోసం బలంగా ముందుకు పోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఇప్పటికే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను కోరుతూ లేఖలు రాశామని, మరోసారి అన్ని పార్టీల అధ్యక్షులను కోరతానని అన్నారు. ఉప ఎన్నికల్లో గెలవడమే మనం శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చే అసలైన నివేదిక అని కోదండరామ్ అన్నారు.

ఉప ఎన్నికల్లో పోటి చేయాలంటే తమకేమీ భయం లేదని, ఇతర పార్టీల వ్యవహారశైలిపైనే అనుమానాలున్నాయని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెసు పోటీ చేయడం అనైతికమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ నేతల వ్యవహార శైలి భయాందోళనలకు గురిచేస్తోందని ఆయన అన్నారు. డిసెంబర్ 9వ తేదీన కేంద్రం చేసిన ప్రకటనను సీమాంధ్ర నాయకులు అడ్డుకున్నారని ఆయన అన్నారు. రాజీనామాలతో తెలంగాణ సాధించుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుతో సహా తెలంగాణ నాయకులు, జేఏసీ నేతలు, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్ధి జేఏసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అలాగటు ఉప ఎన్నికల్లో ముందుకు ఏ విధంగా పోవాలి, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలియవచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X