హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధిష్టానం వద్దన్నా ఓదార్పు యాత్రకు వైయస్ జగన్ ఏర్పాట్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్‌: పార్టీ అధిష్టానం వద్దన్నా కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయంపై ఆయన తన సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అధిష్టానం ఔనన్నా, వద్దన్నా ఆయన ఓదార్పు చేపట్టేట్లున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అయితే, చివరి నిమిషంలో అధిష్టానం నుంచి అనుమతి రావచ్చుననే ఆశాభావంతో కూడా జగన్ శిబిరం ఉంది. వైయస్ జగన్ తల్లి విజయలక్ష్మి లేఖ రాసి మూడు వారాలు దాటుతున్నా ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి ఎటువంటి సమాధానం కూడా రాలేదు.

జగన్ ను కలిసేందుకు సోనియా సుముఖంగా లేరని కొంత మంది నాయకులు అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వచ్చే నెల 8వ తేదీన ఓదార్పు యాత్ర చేపడతానని ప్రకటించడం ద్వారా తమకు గడువు పెట్టినట్లుగా అధిష్టానం భావిస్తోంది. అది ఒక రకంగా బ్లాక్ మెయిల్ లాంటిదనే ఆగ్రహంతో సోనియా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, జగన్ శిబిరం మాత్రం తమకు తప్పకుండా సోనియా అనుమతి లభిస్తుందని, చివరి నిమిషంలో జగన్ తో సోనియా మాట్లాడేందుకు అవకాశం ఉందని ఆశిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X