హై కమాండ్ ను కాదంటే జగన్ కు మనుగడ ఉండదు: యాష్కీ

ముఖ్యమంత్రి రోశయ్యను గద్దె దించడానికి పార్టీలోని ఒక వర్గం కుట్ర చేస్తోందని, అందుకే రోశయ్యను బిసి వ్యతిరేకిగా చిత్రించే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణలోని ఉప ఎన్నికల్లో అంతిమ తీర్పు ప్రజలేదనని, అయితే ఈ ఎన్నికలు తెలంగాణవాదానికి ప్రతీకలు కావని ఆయన అన్నారు. అధిష్టానం ఆదేశిస్తే తాను ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు. కాంగ్రెసుతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని ప్రజలను పార్టీ ఒప్పించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేసిందని, అయితే సీమాంధ్ర నాయకుల కుట్ర వల్ల వెనక్కి వెళ్లిందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం నాయకుల చేతుల్లోంచి ప్రజల్లోకి వెళ్లిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుంటే రాజకీయ నాయకులు తెలంగాణలో తిరగలేరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications