రామోజీ ఈనాడుపై సాక్షి డైలీ మరోసారి దాడి
ఈనాడు దినపత్రిక వార్తాకథనాన్ని ఆసరాగా తీసుకుని రోశయ్య ప్రభుత్వంపై కూడా సాక్షి దినపత్రిక విమర్సలు గుప్పించింది. బీసి ఫీజుల రీయంబర్స్ మెంటుకు వైయస్ హయాంలో బడ్జెట్ కు మించి నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. వైయస్సార్ మరణం తర్వాతనే పథకానికి చిక్కులు మొదలయ్యయాని సాక్షి తప్పు పట్టింది. బకాయిలు చెల్లించకుండా ప్రస్తుత ప్రభుత్వం పెంచుకుంటూ వచ్చిందని, దీంతో బకాయిలు తడిసి మోపడయ్యాయని విమర్శించింది. ఇప్పుడు వాటిని చెల్లించలేక ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నట్లు అభిప్రాయపడింది. ఎడాపెడా అన్ని చార్జీలు పెంచుతున్నా డబ్బుల్లేవంటూ ప్రభుత్వం బీదరుపులు అరుస్తోందని సాక్షి వార్తాకథనం వ్యాఖ్యానించింది.
ఆ రకంగా వైయస్సార్ పై మరో కుట్ర ప్రారంభమైందని సాక్షి ఆరోపించింది. వైయస్ హయాంలో ఫీజు రీయంబర్స్ మెంటు పథకాన్ని ఎలా అమలు చేసిందీ సాక్షి వివరించింది. ఇప్పుడు బకాయిలు ఎలా పేరుకుపోయాయో వివరించింది. గణాంకాలతో వాటిని సాక్షి దినపత్రిక వివరించింది. ప్రభుత్వ ప్రస్తుత ప్రతిపాదన పేద విద్యార్థుల ఆగ్రహానికి గురవుతోందని సాక్షి వ్యాఖ్యానించింది.